శ్రీకాకుళం పట్టణంలోని ఎన్టీఆర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కె.డిల్లేశ్వరరావు, పి.భార్గవి, బి.జాహ్నవి నీలిమ లకు రిమ్స్ ఆప్తాలమిస్టు బి.వినీత వైయస్సార్ కంటివెలుగులో భాగంగా విద్యార్థులకు కంటి అద్దాల ఫ్రేములను అందించారు. హెడ్ మాష్టర్ దేవదత్తానంద్ కంటివెలుగు ప్రోగ్రాం స్పష్టమైన చూపుకోసం కంటి అద్దాలను అందించటం చాలా ఉపయుక్తమన్నారు. ఈ కార్యక్రమములో పాఠశాల ఉపాధ్యాయులు హరినాధమ్, మూర్తి, సీతారామ్, ఆదిత్య, క్రాప్ట్ శ్రీనివాసరావు, ఆర్ట్ శ్రీలక్శ్మి, సుజాత, ఉమా పాల్గొన్నారు.