వాళ్లు ఫ్రంట్ లైన్ వారియర్స్…ఎండననక,వాననక, పగలంతా రోడ్లమీదనే డ్యూటీలు చేస్తారు..ఏం మేము చెయ్యటం లేదా అంటూ ఇది చదివిన వారు ఎవ్వరైనా అడగ వచ్చు..అనుకోవచ్చు.కానీ పోలీస్ శాఖలో అందులో ట్రాఫిక్ విభాగంలో పని చేసే ప్రతీ ఒక్కరికీ ఈ కరోనా కాలంలో హేట్సాప్ చెప్పాలంటోంది…సత్యం న్యూస్.నెట్.
ఏపీ రాష్ట్ర పోలీస్ శాఖలో ట్రాఫిక్ పోలీసుల పనితీరు అనన్యసామాన్యం. ఈ కరోనా సమయంలో వారి సేవలను గుర్తించింది…విజయనగరం జిల్లాలోని ప్రముఖ వ్యాపార సంస్థ.ఎస్.వీ.ఎన్ గ్రూప్స్. జిల్లా కేంద్రంలో అందులోనూ నగరంలో ఎండననక,వాననక, కష్టపడుతున్నదెవరంటే…ట్రాఫిక్ పోలీసులే.
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో ఓ ఫ్రంట్ లైన్ వారియర్స్ లా పని చేస్తున్నది మాత్రం….ట్రాఫిక్ పోలీసులే. అటువంటి వారి సేవలను గుర్తించింది..నగరంలోని ప్రముఖ వ్యాపార సంస్థ…ఎస్.వీ.ఎన్. ఈ మేరకు ట్రాపిక్ డీఎస్పీ మోహన్ రావు ఆధ్వర్యంలో దాదాపు 80 సన్ గ్లాసస్ ను…ఆ విభాగపు సిబ్బందికి…ఎస్పీ రాజకుమారీ చేతులు మీదుగా ఇప్పించారు…ఎస్వీఎన్ అధినేత జీ.శ్రీనివాసరావు.
ఈ మేరకు నగరంలో బాలాజీ జంక్షన్ వద్ద ఎస్పీ రాజకుమారీ…ట్రాపిక్ సిబ్బందికి కళ్లద్దాలను పంపిణీ చేసారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో..అదీ లాక్డౌన్ అమలువతున్న సమయాలలో అందునా ట్రాఫిక్ పోలీస్ సేవలను గుర్తించడం అభినందనీయమన్నారు.
కర్ఫ్యూ విధుల్లో ఉంటూ, కఠినతరమైన విధులను ట్రాఫిక్ పోలీసులు నిర్వహించడాన్ని కళ్లరా చూసిన ఎస్ వి ఎన్ గ్రూపు ఎంతో ఉదారత తో ముందుకు రావడం ఎంతైనా అభినందనీయమన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, సోషల్ డిస్టన్స్ పాటించాలని, శానిటైజర్ వాడుతూ, డబుల్ మాస్క్ ధరించే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.
కర్ఫ్యూ పటిష్ట వంతంగా అమలు చేయడం ద్వారా జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి అన్నారు.. ఎస్ వి ఏన్ గ్రూప్ సీఎం డి శ్రీనివాసరావు మాట్లాడుతూ తన తండ్రి ఆలోచనలు, సేవ స్ఫూర్తికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.
సమాజ హిత కార్యక్రమాలకు తమ సంస్థ, కుటుంబ సభ్యులు ఎప్పుడు ముందు ఉంటామన్నారు. సమాజం ద్వారా సంపాదించిన సొమ్మును, తిరిగి సమాజానికి ఖర్చు చేయాలన్న తన కన్నవారి స్ఫూర్తితో సమాజ హిత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని అన్నారు.
అనంతరం జిల్లా ఎస్పీ రాజకుమారి,సంస్థ సీఎండీ శ్రీనివాసరావు కు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు జి కార్తీక్, జి ఈశ్వర్ కౌశిక్ తో పాటు ట్రాఫిక్ డీఎస్పి మోహన్ రావు, వన్ టౌన్ సీఐ మురళీ, టూ టౌన్ సీఐ శ్రీనివాసరావు, సిసిఎస్ సీఐ కాంతారావు, ఎస్ బీ. రాంబాబు, ఎస్సైలు పాల్గొన్నారు