సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్య అన్నారు. కలెక్టర్ సత్తుపల్లి మండలం యాతాలకుంట లో జరుగుతున్న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్ట్ పనులు ముమ్మరంగా చేపట్టి, పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రాజెక్ట్ క్రింద భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందజేత చర్యలు వెంటనే పూర్తి చేయాలన్నారు. టన్నెల్ పనుల్లో వేగం పెంచాలని ఆయన తెలిపారు. మెషినరీ, పనివాళ్లను పెంచాలని, పనులు త్వరితగతిన పూర్తికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.