గుంటూరు జిల్లా నరసరావుపేట లోని ఒక స్కూల్ లో ఎక్కడా జరగని దారుణం జరిగింది. ప్రభుత్వం పంపిణీ చేసిన కోడిగుడ్లలో పురుగులు, కుళ్ళిపోయిన కోడిగుడ్లు వచ్చాయని విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపించారు. తల్లిదండ్రులు ఆ పురుగుల కోడి గుడ్లను వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పెట్టారు. తిలక్ స్కూల్ లో ఈ దారుణం చోటు చేసుకున్నది. తరచూ ఉడకని అన్నం తినలేక విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం ఇలా సుమారు 70 మంది విద్యార్థులకు కోడిగుడ్లు, అన్నం పెడుతున్నది. నలబై మందికి పైగా విద్యార్థులు తినకుండా దాన్ని పారబోశారు.