క్రీడల వలన ఆరోగ్యం మెరుగుదల అవుతుందని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్-చార్జ్ డాllచదలవాడ అరవింద బాబు అన్నారు. ఈపూరు మండలం ముప్పావు గ్రామంలో బుధవారం నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్-చార్జ్ డాllచదలవాడ అరవింద బాబు పర్యటించారు.
ఆ గ్రామంలో రెండు రాష్ట్రాల స్దాయిలో నిర్వహించబడుతున్న కబడ్డీ పోటీలను డాllఅరవింద బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాllఅరవింద బాబు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని గ్రామాలలో కోడిపందాలు, పేకాట,జూదం వంటివాటిని కాకుండా ఆటల పోటీలు నిర్వహించటం అభినందనీయమని పేర్కొన్నారు.
ముప్పాళ్ళ గ్రామంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామస్తులందరూ ఐక్యంగా కబడ్డీ పోటీలున నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. క్రీడాకారులతో కబాడీ ఆటలు ఆడారు, క్రీడాకారులు క్రీడాస్పూర్తితో ఆడాలను సూచించారు.
ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొల్లి బ్రహ్మయ్య,పులిమి రామిరెడ్డి,కొల్లి వెంకటేశ్వర్లు,చల్లా సుబ్బారావు, ఖాశిం గ్రామ టిడిపి నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.