మానసిక వికాసానికి , శారీరిక దారుఢ్యానికి క్రీడలు ఎంతో అవసరం అని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మల్లాపూర్ డివిజన్ అశోక్ నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాందిని క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా బండారి లక్ష్మారెడ్డి , స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి లు పాల్గోని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం చాందిని క్రికెట్ టోర్నమెంట్
ఆర్గనైజర్ శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో జరిగినది. ఈ టోర్నమెంట్లో 40 టీమ్స్ పాల్గొన్నాయి. విన్నర్స్ గా మల్లాపూర్ కు చెందిన రాయల్ కింగ్స్ – రన్నర్స్ గా అశోక్ నగర్ కు చెందిన సత్తి టీంలు విజేతగా నిలిచారు. విన్నర్స్ కి రూ.10000/-లు రన్నర్స్ కి రూ. 5000/- లు ట్రోఫీ మరియు మెడల్స్, బహుమతుల ను బండారి లక్ష్మారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో కటార్ల భాస్కర్, యాదగిరి యాదవ్, రాజగోపాల్ సారు, నాగారం బాబు, సంపత్ గౌడ్ , అశోక్ నగర్ యూత్ మెంబర్స్ పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి