ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయానికి శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి వెండి కలవ పూలతో అర్చకులు పూజలు నిర్వహించారు. ఈరోజు వరలక్ష్మీ దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
అమ్మవారికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ వాణిమోహన్ తొలి పూజలు నిర్వహించారు.