30.7 C
Hyderabad
April 19, 2024 10: 29 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీ‌వారి ఆల‌యం నుండి అమ్మవారికి సారె

#ammavaru

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె స‌మ‌ర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు. ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌ట్టారు. అనంత‌రం శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వ‌హించారు. ఆ త‌రువాత ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు. అక్క‌డినుండి కోమ‌ల‌మ్మ స‌త్రం, శ్రీ కోదండరామాలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, లక్ష్మీపురం సర్కిల్, శిల్పారామం నుండి తిరుచానూరు పసుపు మండపం మీదుగా ఆలయం వ‌ద్ద అమ్మ‌వారికి సారె స‌మ‌ర్పించారు. ఆభ‌ర‌ణంతో కూడిన శ్రీ‌వారి సారెను అలిపిరి వ‌ద్ద ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి జెఈవో శ వీరబ్రహ్మంకు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు  పాల్గొన్నారు.

Related posts

రైతు మిత్ర ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Satyam NEWS

చావ్లా గ్యాంగ్ రేప్ కేసులో సుప్రీం తీర్పుపై ఢిల్లీ ప్రభుత్వం అప్పీలు

Bhavani

తిరుమల తిరుపతి ఈవోగా జవహర్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment