జెఈఈ (మెయిన్) పరీక్షా ఫలితాలలో శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ అద్భుత ఫలితాలు సాధించింది. నలుగురు విద్యార్ధులు నూటికి నూరు శాతం మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. ఒక విద్యార్ధి 99.99 శాతం మార్కులు సాధించాడు. తెలంగాణ కు చెందిన ఆర్. అరుణ్ సిద్దార్ధ్, సి.కౌశల్ కుమార్ లు నూటికి నూరుశాతం మార్కులు సాధించగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన టి వి శ్రీ సాయి శంకర్, లెండా జితేంద్ర లు నూటికి నూరు శాతం మార్కులు సాధించారు.
కర్నాటకకు చెందిన ఆర్. సుభాన్ 99.99 మార్కులు సాధించాడు. ఈ విధమైన ఫలితాలు సాధించడం తమకు గర్వకారణమని శ్రీ చైతన్య అకాడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన తెలిపారు. విద్యార్ధుల కృషి లెక్చరర్ల మార్గదర్శకత్వం సమర్ధంగా ఉండటం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని అన్నారు. రికార్డు స్థాయి ఫలితాలు సాధించిన విద్యార్ధులకు శ్రీ చైతన్య అకాడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన అభినందనలు తెలిపారు.