39.2 C
Hyderabad
March 29, 2024 15: 33 PM
Slider ఆధ్యాత్మికం

వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

tirumala

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు బుధ‌వారం ప్రారంభమయ్యాయి. కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు.


ఈ సంద‌ర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, పంచగన్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు. ఆ త‌రువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం ఆస్థానం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేయనున్నారు.


ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో శ్రీ ధనంజయులు, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, ఆల‌య‌ అర్చక బృందం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

వధూవరులకు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా పట్టువస్త్రాలు

Satyam NEWS

నెల్లూరు జిల్లాలో వైసీపీపై మరో ఎమ్మెల్యే అసంతృప్తి గళం

Satyam NEWS

ఇంత చైతన్యం ఆనాడు ఉంటే ప్రత్యూషకు న్యాయం జరిగేది

Satyam NEWS

Leave a Comment