సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ప్రతి సంవత్సరం జరిగే శ్రీ కంఠమహేశ్వర స్వామి జాతర ఆదివారం గౌడ సంఘ కులస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీపీసీసీ చీఫ్ నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు.
ప్రజలందరూ సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో, పైరు పంటలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన కోరుకున్నారు. అనంతరం టిపిసిసి చీఫ్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డిని గౌడ సంఘం పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.