పశ్చిమగోదావరి జిల్లా….. పాలకొల్లు….. పంచారామ క్షేత్రం శిరోబాగ నిలయం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచి స్వామిని దర్శించుకొనుటకు భక్తజన సందోహం పోటెత్తింది. ఈ రెండవ సోమవారం విశిష్టత ఏమిటంటే కార్తీక పౌర్ణమి సోమవారం కావడంతో అందునా గ్రహణం ముందు రోజు రావడంతో ఈరోజు విశిష్టత సంతరించుకుందని దేవాలయ అర్చకులు అనిల్ అన్నారు. ఈరోజు శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు అని ఈరోజు కేదారేశ్వర వ్రతం, సత్యనారాయణ వ్రతం చేసుకుంటే మహా పుణ్యం అని, దీపదానం, సాలగ్రామ దానాలు ఈ రోజున చేస్తే మహా పుణ్యఫలం లభిస్తుందని అనిల్ అన్నారు.
previous post