24.7 C
Hyderabad
March 29, 2024 08: 02 AM
Slider సినిమా

108 దేవాలయాల్లో విడుదలైన శ్రీ లక్ష్మీ సహస్ర చిత్రం పాటలు

#laxmisahasra

రవీక్వన్ వర్సిటీ బ్యానర్ పై నిర్మిస్తున్న “శ్రీ లక్ష్మీ సహస్ర” చిత్రంలోని మొదటి పాటను నేడు దేశ వ్యాప్తంగా ఒకే సారి 108 దేవాలయాల్లో వర్చువల్ గా విడుదల చేశారు. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం రాజుల్లా గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఎంపిపి అశోక్ పటేల్ లింక్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రంలో  ఇదే గ్రామానికి చెందిన బాలనటుడు నటిస్తున్న మాస్టర్ సంగమ్ రాజ్ ఈ కార్యక్రమంలో ఉండడం విశేషం. అతిథులుగా ZPTC భారతి రాజు, AMC Chairman మల్లికార్జున్ పటేల్, గ్రామ ఉప సర్పంచ్ హన్మంతరావు పటేల్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు కుషాల్, చంద్రకాంత్, మనోహర్, అశోక్ స్వామి, నటుడి కుటుంబ సభ్యులు ప్రకాష్, కిరణ్, అశోక్ సంజయ్ పాల్గొన్నారు.

ఈ చిత్రం గురించి MPP అశోక్ పటేల్ మాట్లాడుతూ నేటి సమాజంలో వ్యాపార దృక్పథంతో వస్తున్న చిత్రాల్లా కాకుండా, దర్శకుడు రవిశ్రీ ఆధ్యాత్మికత,  సంస్కృతి, సాంప్రదాయ విలువలున్న చిత్రం సమాజానికి ఉపయోగపడే విధంగా అందిస్తున్నారని  చెప్పారు. ఈ చిత్రంలో నటిస్తున్న మాస్టర్ సంగమ్ రాజ్ అభినందించారు. ఈ చిత్రం విడుదల అయిన తరువాత ఘనవిజయం సాధిస్తుందని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

జి.లాలయ్య సత్యం న్యూస్ రిపోర్టర్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ అనుచరులకు క్లీన్‌చిట్‌

Sub Editor

ఉపయోగపడే మొక్కలు నాటిన ఉపాధ్యాయులు

Satyam NEWS

తిరుమలలో క్రమంగా పెరుగుతున్న భక్తుల రద్దీ

Satyam NEWS

Leave a Comment