శ్రీ సత్యసాయి అనిమల్ కైండ్ నెస్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రాయచోటి పోలీసు స్టేషన్ ఎదుట మూగజీవుల దాహార్తి తీర్చడం కోసం నీటి తొట్లు ఏర్పాటు చేశారు.
నీటి తొట్లలో నీటిని నింపి డిఎస్పీ వాసుదేవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూగజీవుల దాహార్తి తీర్చేందుకు ప్రతి ఒక్కరు మానవత్వంతో ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ రాజు,యస్ ఐ నరసింహ రెడ్డి,ట్రాఫిక్ యస్ ఐ వరప్రసాద్ పోలీసు సిబ్బంది ,సొసైటీ అధ్యక్షుడు మిఠాయి ఖాసీం సభ్యులు పాల్గొన్నారు.