ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టిఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం అంబారుపేట లోని శ్రీ సత్య సత్యమ్మ అమ్మ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వసంత లక్ష్మీ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు మంత్రి పువ్వాడ దంపతులకు సాదర స్వాగతం పలికారు. దేవస్థానం వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలకాలం సుభిక్షంగా ఉండేలా దీవెనలు అందించాలని అమ్మవారిని వారిని వేడుకున్నానన్నారు. ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రావు, ఈఓ నాగరాజు లు మంత్రి దంపతులకు శాలువాలతో సత్కరించారు.
previous post
next post