37.2 C
Hyderabad
March 28, 2024 19: 42 PM
Slider నిజామాబాద్

బీర్కూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు

#pocharam

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కుర్ మండల తిమ్మాపూర్ గ్రామ కొండ పైన జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 7వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఏదురుకోల్లు, మాడ వీధులలో గజ వాహనంపై స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పోచారం శంభు రెడ్డి శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వామి వారి గజ వాహనం నడుపుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవ చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో మండల పరిధిలోని మహిళా భక్తులు కోలాటాలు ఆడుతూ సంబరాలు జరుపుకున్నారు. మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

బాధిత హిందీ పండితులకు జీతాలు చెల్లించాలని కలెక్టర్ కు వినతి

Bhavani

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన హీరో సాయిధరమ్ తేజ్

Satyam NEWS

చిన్న దడిగి లో ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన

Satyam NEWS

Leave a Comment