కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కుర్ మండల తిమ్మాపూర్ గ్రామ కొండ పైన జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 7వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఏదురుకోల్లు, మాడ వీధులలో గజ వాహనంపై స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పోచారం శంభు రెడ్డి శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వామి వారి గజ వాహనం నడుపుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవ చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో మండల పరిధిలోని మహిళా భక్తులు కోలాటాలు ఆడుతూ సంబరాలు జరుపుకున్నారు. మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.