కడపజిల్లా కడప జిల్లా నందలూరు మండలం లోని అరవపల్లె లోని శ్రీ కృష్ణ గీతా మందిరంలో అఖిల భారత యాదవ మహాసభ కార్యదర్శి భారతల శ్రీధర్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీకృష్ణ సత్యభామ రూపిణీ సమేత కళ్యాణం నిర్వహించారు.
ఈ కల్యాణం కు పరిమిత సంఖ్య లో భక్తులకు ప్రవేశం కల్పించారు. ప్రతి ఏటా వేడుకగా వేలాదిమంది భక్తుల మధ్య జరిగే ఈ కళ్యాణం ఈ ఏడాది కరోనా మహమ్మారి మూలంగా పరిమిత భక్తుల మధ్య నిర్వహించారు. ఆలయ కమిటీ, బ్రాహ్మణుల నేతృత్వంలో ఈ కళ్యాణ కార్యక్రమం జరిగింది.
కల్యాణ వరులను వివిధ పుష్పాలతో, ఆభరణాలతో అలంకరించారు. మంగళ వాయిద్యాలు నడుమ పండితుల నేతృత్వంలో కళ్యాణం శాస్రోక్తంగా స్వామి వారు రూపిణీ సత్యభామ మాంగళ్య ధారణ గావించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.