26.2 C
Hyderabad
January 15, 2025 16: 54 PM
Slider జాతీయం

తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి సేవలో శ్రీలంక ప్రధాని

srilanka PM

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నేడు శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే దర్శించుకున్నారు. నేడు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే, ఆయన కుమారుడు యోషిత రాజపక్సే, శ్రీలంక మంత్రి ఆర్ముగం తొండమాన్‌ స్వామివారి సేవలో పాల్గొన్నారు.

రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి మహాద్వారం వద్ద వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీలంక ప్రధాని బృందానికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. 

Related posts

మంత్రి పదవి దక్కేదెవరికి

Satyam NEWS

కేర్ ఫుల్: పతంగులు ఎగరవేస్తున్నారా జాగ్రత్త!

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: టీటీడీ అధికారుల వ్యవహారశైలిపై విచారణ జరపాలి

Satyam NEWS

Leave a Comment