39.2 C
Hyderabad
March 28, 2024 15: 11 PM
Slider ఖమ్మం

శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి

#srinivasarao

విధి నిర్వహణలో అమరుడైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ రేంజ్‌ అటవీ అధికారి చలమల శ్రీనివాసరావు(42) అంత్యక్రియలు పూర్తయ్యాయి. పోడు సాగుకు అడ్డొస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల చేతిలో శ్రీనివాసరావు దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం  ఈర్లపూడిలో శ్రీనివాసరావు ప్రభుత్వ లాంచనలతో  అంత్యక్రియలు పూర్తి చేశారు. రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మంత్రులు పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి శ్రీనివాసరావు పాడె మోసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులు, అటవీ శాఖ అధికారుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, ఎమ్మెల్యే రేగా కాంతారావు, అటవీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శాంతకుమారి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

[

Related posts

పులి చర్మం వ్యాపారం చేసే అంతర్రాష్ట్ర ముఠా పట్టుకున్న ములుగు పోలీసులు

Satyam NEWS

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన కోసం కృషి చేస్తా

Satyam NEWS

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగాధంలోకి నెట్టిన జగన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment