సిరిసిల్లా జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా త్రిరాత్రి ఉత్సవ హావనం నిర్వహించారు.
అంతకుముందు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.
అదే విధంగా సీతారామచంద్ర స్వామి వారి పంచ ఉపనిషత్ ద్వారభిషేకము, పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారి ఊరేగింపు సేవకు వాహనంగా నంది, గరుత్మంతుని వినియోగించారు. కరోనా నిబంధనలకు లోబడి పై కార్యక్రమాలను నిర్వహించారు.