ఆషాడ పౌర్ణమి పురస్కరించుకుని శనివారం కర్నూలు జిల్లా శ్రీశైలమహాక్షేత్రంలో శాకంబరి ఉత్సవం నిర్వహించారు.
ఉత్సవంలో భాగంగా ఆగమశాస్త్రం ప్రకారం శ్రీ భ్రమరాంబ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఈవో కె.ఎస్.రామారావు దంపతులు అర్చకులు వేద పండితులు పాల్గొన్నారు.
అమ్మవారి మూలమూర్తి ని, ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాలైన ఆకుకూరలు కూరగాయలు వివిధ రకాల ఫలాలతో అలంకరించారు.
శాకంబరీ అలంకారం లో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరించారు.
ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారిని శాకాలతో అర్చించడం వల్ల అతివృష్టి అనావృష్టి నివారించబడి సకాలంలో తగినంత వర్షాలు కురిసి పాడి పంటలు పండుతాయని కరువు కాటకాలు నివారించబడతాయి పురాణాలు చెబుతున్నాయి.