36.2 C
Hyderabad
April 18, 2024 13: 47 PM
Slider ఆధ్యాత్మికం

శాకంబరి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబ దేవి

#Srisailam Temple

ఆషాడ పౌర్ణమి పురస్కరించుకుని శనివారం కర్నూలు జిల్లా శ్రీశైలమహాక్షేత్రంలో శాకంబరి ఉత్సవం నిర్వహించారు.

ఉత్సవంలో భాగంగా ఆగమశాస్త్రం ప్రకారం శ్రీ భ్రమరాంబ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఈవో కె.ఎస్.రామారావు దంపతులు అర్చకులు వేద పండితులు పాల్గొన్నారు.

అమ్మవారి మూలమూర్తి ని, ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాలైన ఆకుకూరలు కూరగాయలు వివిధ రకాల ఫలాలతో అలంకరించారు.

శాకంబరీ అలంకారం లో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరించారు.

ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారిని శాకాలతో అర్చించడం వల్ల అతివృష్టి అనావృష్టి నివారించబడి సకాలంలో తగినంత వర్షాలు కురిసి పాడి పంటలు పండుతాయని కరువు కాటకాలు నివారించబడతాయి పురాణాలు చెబుతున్నాయి.

Related posts

‘చెత్త ఇండియా’ వ్యాఖ్యలకు జో బైడెన్ గట్టి కౌంటర్

Satyam NEWS

చంద్రన్నను విడుదల చేయాలి

Bhavani

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమావేశం

Satyam NEWS

Leave a Comment