38.2 C
Hyderabad
April 25, 2024 11: 39 AM
Slider కర్నూలు

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

#Srisailam Project

ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో  కృష్ణానది కి వరద నీరు పోటెత్తుతోంది.

ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి వరదనీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో శ్రీశైలం జలాశయం అధికారులు అప్రమత్తమయ్యారు.

ప్రాజెక్ట్ పది గేట్లను 10 అడుగుల ఇరవై అడుగుల మేర ఎత్తి వరద నీటిని దిగువనున్న నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్ ప్లో  3, 00, 354 క్యూసెక్కుల గా  ఉండగా, ఔట్ ప్లో  4, 73, 630  కూసెక్కులుగా ఉంది.

అయితే ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం  884.40 అడుగులు మేర కొనసాగుతుంది. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీ.ఏం.సి. లు

కాగా ప్రస్తుతం 212.4385 టీ.ఏం.సి లుగా ఉంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుంది.

వి.వెంకట శివుడు

Related posts

ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి

Satyam NEWS

విద్యుత్ చార్జీల బాదుడుతో వినియోగదారుల విలవిల

Satyam NEWS

మహిళలచే స్వయంగా దిశ యాప్ ను డౌన్ లోడ్ చేయించండి

Satyam NEWS

Leave a Comment