18.7 C
Hyderabad
January 23, 2025 03: 25 AM
Slider జాతీయం

టెంపరరీ:కూలిన స్టేడియం గ్యాలరీ 50 మందికి గాయాలు

stadium wounds

కేరళలోని పలక్కడ్‌ పుట్‌బాల్‌ స్టేడియంలోగ్యాలరీ కూలి సుమారు 50 మంది గాయడ్డారు. నిర్వాహకులు ఆదివారం స్టేడియంలో ఛారీటీ పుట్‌బాల్‌ మ్యాచ్‌ ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ మ్యాచ్‌ ప్రారంభానికి ముందే ఒక్కసారిగా కూలింది. ఈ మ్యాచ్‌కు అతిథులుగా ఇండియన్‌ పుట్‌బాల్‌ లెజెండ్స్‌ విజయన్‌, బైచింగ్‌ భూటియా హాజరయ్యారు.

సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులను స్థానికంగా ఉన్న పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి విజయన్‌, బైచింగ్‌ క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలు ఎవరికీ కాలేదని పోలీసులు తెలిపారు.

Related posts

ప్రమాద అంచుల్లో పోలవరం

Satyam NEWS

ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రశంస

mamatha

కొనసాగుతున్న ఆదాయపు పన్నుశాఖ వేట

Satyam NEWS

Leave a Comment