36.2 C
Hyderabad
April 24, 2024 20: 59 PM
Slider జాతీయం

ప్రయివేటు ఆసుపత్రుల్లో ఇంత ఎదవలు ఉంటారా???

#coronavaccine

రెమిడిస్వేర్…. ఈ ఇంజెక్షన్ తో కరోనా తగ్గుతుందో లేదో తెలియదు కానీ కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని ఆ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ మాత్రం జోరుగా నడుస్తున్నది.

ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ నగరంలోని ఒక ఆసుపత్రిలో ఇద్దరు నర్సులు రెమిడిస్వేర్ ఇంజక్షన్ ను బ్లాక్ లో అమ్ముతూ పట్టుబడ్డారు.

మీరట్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో జరిగిన ఈ ఉదంతంలో ఆ ఇద్దరు నర్సులను పోలీసులు అరెస్టు చేశారు.

డాక్టర్లు ఒక కరోనా రోగికి రెమిడిస్వేర్ ఇంజక్షన్ ఇవ్వాలని ప్రిస్క్రైబ్ చేశారు. ఆ రోగి తరపు వారు ఆ ఇంజక్షన్లు తెచ్చి ఇచ్చారు.

వాటిని ఆ రోగికి ఇవ్వకుండా ఈ ఇద్దరు నర్సులు దాచిపెట్టేశారు.

తర్వాత ఆ ఇంజక్షన్ లను రూ.32 వేలకు అమ్ముకున్నారు. కరోనా సోకిన ఆ రోగి మరణించారు.

దారుణమైన ఈ పరిస్థితి చూస్తే ఏమనిపిస్తున్నది….?

ఈ ఆసుపత్రులపై నమ్మకం ఉంటుందా? ఈ వైద్య సిబ్బందిపై నమ్మకం ఉంటుందా?

అసలు మానవత్వం అనేది బతుకుతుందా…??????

Related posts

బాలకోట్ హీరో అభినందన్‌కు గ్రూప్ కెప్టెన్‌గా ప్రమోట్..

Sub Editor

రేషన్‌ డోర్‌ డెలివరీకి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Satyam NEWS

ఏసిబికి పట్టుబడ్డ సీతారాంపురం ఎమ్మార్వో

Satyam NEWS

Leave a Comment