రెమిడిస్వేర్…. ఈ ఇంజెక్షన్ తో కరోనా తగ్గుతుందో లేదో తెలియదు కానీ కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని ఆ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ మాత్రం జోరుగా నడుస్తున్నది.
ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ నగరంలోని ఒక ఆసుపత్రిలో ఇద్దరు నర్సులు రెమిడిస్వేర్ ఇంజక్షన్ ను బ్లాక్ లో అమ్ముతూ పట్టుబడ్డారు.
మీరట్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో జరిగిన ఈ ఉదంతంలో ఆ ఇద్దరు నర్సులను పోలీసులు అరెస్టు చేశారు.
డాక్టర్లు ఒక కరోనా రోగికి రెమిడిస్వేర్ ఇంజక్షన్ ఇవ్వాలని ప్రిస్క్రైబ్ చేశారు. ఆ రోగి తరపు వారు ఆ ఇంజక్షన్లు తెచ్చి ఇచ్చారు.
వాటిని ఆ రోగికి ఇవ్వకుండా ఈ ఇద్దరు నర్సులు దాచిపెట్టేశారు.
తర్వాత ఆ ఇంజక్షన్ లను రూ.32 వేలకు అమ్ముకున్నారు. కరోనా సోకిన ఆ రోగి మరణించారు.
దారుణమైన ఈ పరిస్థితి చూస్తే ఏమనిపిస్తున్నది….?
ఈ ఆసుపత్రులపై నమ్మకం ఉంటుందా? ఈ వైద్య సిబ్బందిపై నమ్మకం ఉంటుందా?
అసలు మానవత్వం అనేది బతుకుతుందా…??????