27.7 C
Hyderabad
April 20, 2024 02: 51 AM
Slider జాతీయం

వైష్ణోదేవి మందిరంలో తొక్కిసలాట: 12 మంది మృతి

#vishnodevi
జమ్మూ కాశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి మందిరంలో భక్తుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 12 మంది మరణించారు. పన్నెండు మందికి పైగా గాయపడ్డారు. 

జమ్మూకి 50 కి.మీ దూరంలో త్రికూట కొండలపై ఉన్న ఈ మందిరం గర్భగుడి వెలుపల గేట్ 3 సమీపంలో తెల్లవారుజామున 2.30 గంటలకు తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 12 మంది మరణించారని, వారి మృతదేహాలను గుర్తింపు కోసం కత్రా బేస్ క్యాంప్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు సీనియర్ అధికారులు తెలిపారు.

"మాతా వైష్ణో దేవి భవన్‌లో తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్-జి) సిన్హా, కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, నిత్యానంద్ రాయ్‌లతో మాట్లాడిన  పరిస్థితిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు.

Related posts

దసరాకు రాబోతున్న రవిప్రకాష్ మీడియా

Satyam NEWS

సీఎం జగన్ కి విద్యా వ్యవస్థపై సరైన అవగాహన లేదు

Satyam NEWS

71 వ రాజ్యాంగ దినోత్సవ సభను విజయవంతం చేయండి

Satyam NEWS

Leave a Comment