జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణో దేవి మందిరంలో భక్తుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 12 మంది మరణించారు. పన్నెండు మందికి పైగా గాయపడ్డారు. జమ్మూకి 50 కి.మీ దూరంలో త్రికూట కొండలపై ఉన్న ఈ మందిరం గర్భగుడి వెలుపల గేట్ 3 సమీపంలో తెల్లవారుజామున 2.30 గంటలకు తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 12 మంది మరణించారని, వారి మృతదేహాలను గుర్తింపు కోసం కత్రా బేస్ క్యాంప్లోని ఆసుపత్రికి తరలించినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. "మాతా వైష్ణో దేవి భవన్లో తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్-జి) సిన్హా, కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, నిత్యానంద్ రాయ్లతో మాట్లాడిన పరిస్థితిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు.
previous post