తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణాలో అన్ని రిజిస్ట్రేషన్స్ నిలిపేసింది. కొత్త రెవెన్యూ చట్టం రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
స్టాంప్స్ ,రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సెలవులు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ శాఖలో భారీగా మార్పులు చేయడానికి సీఎం కేసీఆర్ రెడీ అయినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో గత కొంతకాలంగా రెవిన్యూ శాఖలో అవినీతి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.
వీఆర్వోల నుంచి రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నుంచి వాట్సాప్ మెసేజ్ ద్వారా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయి.
దీంతో హుటాహుటిన తహశీల్దార్ లు వి ఆర్ వో నుండి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.