రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైది. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీతో హోంమంత్రి అనిత ఫోన్లో సమీక్ష నిర్వహించారు. అదే విధంగా వివిధ జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలను హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా హెచ్చరించాలని అందరికి ఆదేశం ఇచ్చారు. అలాగే సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచన చేశారు.తాగునీరు, విద్యుత్ వంటి అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.
previous post