‘ఈ వ్యక్తి చనిపోయాడు’ అని వాట్సాప్ స్టేటస్ పెట్టినప్పటికీ భార్య నుండి బదులు రాకపోవడం తో ఓ ఆటో డ్రైవర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నా ఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్నిసాకుతున్న సికింద్రాబాద్ పార్సిగుట్ట లోని సంజీవపురానికి చెందిన రాము కు భార్య రూత్, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
భార్యాభర్తల మధ్య ఈ మధ్య మనస్పర్థల కారణంగా బుధవారం అర్ధరాత్రి 12.59 నిమిషాలకు వాట్సాప్ స్టేటస్ లో ‘ఈ వ్యక్తి చనిపోయాడు’ అని పెట్టాడు.భార్య నుండి ఫోన్ రాలేదని తనను వారించ లేదని భాదతో జామై ఉస్మానియా-ఆర్ట్స్ కాలేజీ స్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.