39.2 C
Hyderabad
March 29, 2024 14: 31 PM
Slider తెలంగాణ

ప్రాక్టికల్: చనిపోయాడు అని స్టేటస్ పెట్టి మరి చచ్చాడు

status death

‘ఈ వ్యక్తి చనిపోయాడు’ అని వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టినప్పటికీ భార్య నుండి బదులు రాకపోవడం తో ఓ ఆటో డ్రైవర్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నా ఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్నిసాకుతున్న సికింద్రాబాద్‌ పార్సిగుట్ట లోని సంజీవపురానికి చెందిన రాము కు భార్య రూత్‌, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

భార్యాభర్తల మధ్య ఈ మధ్య మనస్పర్థల కారణంగా బుధవారం అర్ధరాత్రి 12.59 నిమిషాలకు వాట్సాప్‌ స్టేటస్‌ లో ‘ఈ వ్యక్తి చనిపోయాడు’ అని పెట్టాడు.భార్య నుండి ఫోన్ రాలేదని తనను వారించ లేదని భాదతో జామై ఉస్మానియా-ఆర్ట్స్‌ కాలేజీ స్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

Related posts

వనపర్తిలో పత్రికల ప్రభావం పని చేయదు

Satyam NEWS

కొనసాగుతున్న అల్పపీడనంతో నేడు కూడా వర్షాలు

Satyam NEWS

ఆలన ప్యాలియేటివ్ హోమ్ కేర్ సేవల వాహనం ప్రారంభం

Satyam NEWS

Leave a Comment