కులాలకు మతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బిసి ఓసి లోని పేదల జీవితాలను మారుస్తున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై అసత్య ఆరోపణలు మానుకోవాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ప్రదర్శన నిర్వహించారు.
పేద గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్ధులు ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో దేశంలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలకు ఉన్నత చదువులకు ఎంపిక అవుతున్నారని వారు గుర్తు చేశారు.
బిచ్కుంద మార్కెట్ యార్డులో జరిగిన ఈ ప్రదర్శనలో జిల్లా ఎంఆర్ పి ఎస్ ప్రచార కార్యదర్శి, జుక్కల్ నియోజకవర్గ ఇంచార్జ్ భూమయ్య, మారుతి యాదవ్, అంజయ్య, లింగయ్య, రవి, సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.