సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో విపరీతంగా కుక్కల బెడద ఉన్నందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,ఉదయం సమయంలో వాకింగ్ కి వెళ్లే ప్రజలపై కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయని,వేసవికాలంలో చిన్న పిల్లలు ఇంటి వద్ద ఆటలాడుతున్న సమయంలో కూడా కుక్కలు వారిపై దాడి చేసిన సందర్భాలు ఉన్నాయని, చర్యలు గైకొనాలని మున్సిపల్ కమిషనర్ కి 3వ,వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కోతి సంపత్ రెడ్డి మాట్లాడుతూ 3వ,వార్డు లోనే కాకుండా పట్టణంలో కూడా పలు చోట్ల కుక్కల బెడద ఎక్కువగా ఉన్నందున ఇప్పటికే ఈ విషయాన్ని గత రెండు సర్వసభ్య సమావేశాల్లో అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగిందని,పలుమార్లు వినతి పత్రాలు అందజేశామని, అంతేకాకుండా పట్టణంలోని స్వచ్ఛంద సంస్థలు పౌరుల నుండి కూడా ఫిర్యాదులు అందిన విషయం వివిధ పత్రికలలో కథనాల రూపంలో కూడా ప్రచురితమైందనే విషయాన్ని కమీషనర్ కి గుర్తు చేస్తూ తక్షణమే తగు చర్యలు తీసుకొని,పట్టణ వాసులని కాపాడాలని కోరారు.
మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేసిన వారిలో కౌన్సిలర్ జక్కుల వీరయ్య ఉన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్