వీధి కుక్కల స్వైర విహారంతో 21 గొర్రెలు మృత్యువాత పడ్డ సంఘటన నేడు ములుగు జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది.
పైడిమల్ల వంశీకృష్ణ అనే మటన్ షాప్ నిర్వాహకుడు 35 గొర్రెలను తన షెడ్డులో కట్టేసి రాత్రి షెడ్డు పక్కనే గల తన నివాసంలో నిద్రిస్తున్నాడు.
ఆ సమయంలో వీధి కుక్కలు షెడ్ పై దాడి చేశాయి. దీంతో 16 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఎనిమిది గొర్ల కు తీవ్ర గాయాలు కాగా ములుగు గ్రామ పంచాయతీ సిబ్బంది మృతి చెందిన గొర్రెలను యార్డుకు తరలించారు.
మృతి చెందిన గొర్రెల ఖరీదు సుమారు లక్షా 60 వేల పైగా విలువ ఉంటుందని వంశీకృష్ణ తెలిపాడు. 2 లక్షల 50 వేల రూపాయల పెట్టుబడితో తీసుకొచ్చిన గొర్రెలను కుక్కల దాడిలో కోల్పోవడంతో అతను తీవ్రంగా నష్టపోయాడు.
అధికారులు స్పందించి మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం అందించాలని ఆయన కోరుకుంటున్నారు.
రోజు రోజుకు వీధి కుక్కల స్వైర విహారం పెరగడంతో నోరులేని మూగజీవాలే కాకుండా మనుషులు కూడా ఇబ్బంది పడుతున్నారని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.