కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేసాయి. గ్రామానికి చెందిన బొల్లారపు నడిపి మల్లయ్యకు చెందిన కొట్టంలో ఉన్న గొర్రెలపై దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో 31 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దాంతో బాధితుడు కన్నీరుమున్నీరుగా విలపించాడు. తనకు జీవనాధారమైన గొర్రెలపై కుక్కలు దాడి చేయడంతో తనకు న్యాయం చేయాలని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.
previous post