మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుందరసాల గ్రామంలో అనుకోని ఉత్పాతం సంభవించింది. ఆ గ్రామంలో గ్రామస్తులు అందరూ కలిసి వీధి నాటకం చూశారు.
అందులో వింత ఏముంది అనుకుంటున్నారా?
నిజమే గ్రామాలలో ఇలాంటివి సర్వ సాధారణం. అయితే ఇది కరోనా సమయం. ఆ విషయాన్ని గ్రామస్తులు మరచిపోయారు.
15 రోజుల క్రితం గ్రామంలో చిరుతల రామాయణం ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు కొనసాగించారు.
వీధి నాటకం ప్రదర్శించిన కళాకారుల్లో కరోనా వైరస్ పాజిటివ్ ఉందట.
ఆ విషయం గ్రామస్తులకు తెలియదు దాంతో అది క్రమేపీ గ్రామంలో వ్యాప్తి చెందింది.
కరోనా పరీక్షలు నిర్వహించగా నేటి వరకు సుమారు 100 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు.