38.2 C
Hyderabad
April 25, 2024 12: 27 PM
Slider ఆదిలాబాద్

వందలాది కొంపలు ముంచిన వీధినాటకం

#mancherialrailwaystation

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుందరసాల గ్రామంలో అనుకోని ఉత్పాతం సంభవించింది. ఆ గ్రామంలో గ్రామస్తులు అందరూ కలిసి వీధి నాటకం చూశారు.

అందులో వింత ఏముంది అనుకుంటున్నారా?

నిజమే గ్రామాలలో ఇలాంటివి సర్వ సాధారణం. అయితే ఇది కరోనా సమయం. ఆ విషయాన్ని గ్రామస్తులు మరచిపోయారు.

15 రోజుల క్రితం గ్రామంలో చిరుతల రామాయణం ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు కొనసాగించారు.

వీధి నాటకం ప్రదర్శించిన కళాకారుల్లో కరోనా వైరస్ పాజిటివ్ ఉందట.

ఆ విషయం గ్రామస్తులకు తెలియదు దాంతో అది క్రమేపీ గ్రామంలో వ్యాప్తి చెందింది.

కరోనా పరీక్షలు నిర్వహించగా నేటి వరకు సుమారు 100 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు.

Related posts

గెలిపించిన ప్ర‌జ‌ల‌కు కార్పొరేట‌ర్ ధ‌న్య‌వాదాలు

Sub Editor

“హలో హాలీవుడ్” అంటున్న తెలుగుతేజం “రాజ్ దాసిరెడ్డి”

Satyam NEWS

వైజాగ్ గంజాయి స్మగ్లర్ల ముఠా అరెస్టు

Satyam NEWS

Leave a Comment