విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నవ్యాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ని కడప జిల్లా టి.యన్ యస్.ఎఫ్ ప్రచార కార్యదర్శి పోలి శివకుమార్ కలిశారు. టీఎన్ఎస్ఎఫ్ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వ వైఫల్యాలుపై, టీఎన్ఎస్ఎఫ్ భవిష్యత్ కార్యాచరణ చంద్రబాబు నాయుడు కి వివరించారు.
ప్రభుత్వం వన్ విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ తొమ్మిది నెలలు అవుతున్నా ఇంకా ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతుందని ప్రభుత్వం నిరంకుశ వైఖరి వల్ల ఇటు విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు సమస్యలు ఎదుర్కొంటు న్నాయని పోలి శివకుమార్ చంద్రబాబుకు తెలిపారు.
విద్యార్థులకు అండగా నిలబడి విద్యార్థుల తరపున టిఎన్ఎస్ఎఫ్ బాధ్యత తీసుకుని పోరాటం చేయాలని టిఎన్ఎస్ఎఫ్ నాయకులకు చంద్రబాబు సూచించారు.