12 గంటలు దాటినా ఆచూకీలేని విద్యార్ది మిస్సింగ్ కేసు
విజయనగరం జిల్లా కేంద్రంలోమరో కలకలం…నిన్న కాక మొన్ననే…పోలీస్ క్వార్టర్స్ లో ఏఆర్ ఇన్ స్పెక్టర్ ఆత్మహత్య చేసుకోవడంపై మృతుని భార్య చేసిన ఆరోపణలపై పోలీస్ శాఖ తో ఎస్పీ కూడా తర్జన భర్జన పడుతున్న తరణంలోమరోసంచలనమైన కేసు….వెలుగులోకి వచ్చింది. టెన్త్ చదువుతున్న విద్యార్ది అదృశ్యం కేసు…పోలీసులకు మిస్టరీ గా మారింది. సరిగ్గా సద్నాళ్లగేళ్లు….పదో తరగతి చదువుతున్న రామ్ నగర్ కాలనీ రోడ్ లోఉంటున్న విద్యార్ధి హర్షిత్ అదృశ్యమయ్యాడు. ఈ నెల 3 న స్కూల్ కని వెళ్లిన హర్షిత్…సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. రోజూ యదావిధిగా మధ్యాహ్నం….రెండున్నరకు ఇంటికి వచ్చేస్తున్న హర్షిత్ సాయంత్రం…రాత్రి అయినా ఇంటికి చేరలేదు.దీంతో ఆందోనళ చెందిన హర్షిత్ కన్నవాళ్లు…తమ,తమ బంధువులు,స్నేహితులను సంప్రదించారు…అక్కడకు రాలేదని సమాచారం ఇవ్వడంతో..కంగారు పడి…ఆందోళన చెంది… టూటౌన్ స్టేషన్ కు పిర్యాదు చేసారు. స్కూల్ కు వెళ్లేటప్పుడు కొడుకు హర్షిత్… గ్రీన్ కలర్ షర్టు మరియు డార్క్ బ్లూ జీన్స్ ప్యాంటు వేసుకున్నాడని…దాదాపు. 5.10 అడుగులు ఎత్తు… ,చామనచాయ రంగు కలిగి ఉంటాడని తండ్రి హరిప్రసాద్… టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు.ఫిర్యాదు అందుకు పోలీసులు… బాయ్ మిస్పింగ్ కేసుగా నమోదు చేసి….ఆచూకి చెప్పాలనుకుంటే….సీఐ లక్ష్మణరావు… 9121109420 కు లేదా ఎస్ఐ రాజే్ష్… 9121109520 నెంబర్లకు ఫోన్ చేయాలని పోలీసులు కోరారు.అయితే టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్ధి…అదృశ్యం అవడానికి కారణం…ప్రేమ వ్యవహారమా.. ? కన్నవాళ్ల తిట్టినందుకు ఇంటికి రాలేదా…అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.అయితే ఈ మిస్సింగ్ వెనకాల..ప్రేమ వ్యవహారమా..? లేక క్షణికావేశామా…? పోలీసుల దర్యాప్తే తేల్చాలంటోంది… సత్యం న్యూస్.నెట్.