ఖాళీగా ఉన్న ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ ఈ నెల 12 న మహోద్యమం చేపట్టనున్నట్టు…ఎస్ఎఫ్ఐ నేత సాగర్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అమర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విద్యార్ధి సంఘాలైన ఎస్ఎఫ్ఐ ,టీఎన్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, నేతలు మాట్లాడారు.
రాష్ట్రంలో రెండు లక్షల యాభైవేలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎస్ఎఫ్ఐ నేత పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర పాలన చేపట్టి మూడేళ్లు అవుతున్నా…ఒక్క ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదని ఆరోపించారు. అధికారం లోకి రాకపోయినప్పడు..నేను ఉన్నాను..నేను విన్నాను…అంటే.. మూడేళ్లైన ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడమేనా అంటూ విమర్శించారు.
ఈ నేపద్యంలో రాష్ట్రంలో ఖాళీ గా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ రాస్ట్ర స్థాయిలో మహోధ్యమం చేపట్టాలని అన్ని విద్యార్ధి సంఘాలు నిర్ణయం తీసుకున్నాయన్నారు. ఈ క్రమంలోనే ఈ నె 12న బెజవాడలో మహా ఉద్యమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.