40.2 C
Hyderabad
April 19, 2024 15: 51 PM
Slider ముఖ్యంశాలు

ఇష్టంతో కష్టపడి చదువుకోవాలి

#potugantiramulu

ఇష్టంతో కష్టపడి చదువుకోవాలని నాగర్ కర్నూల్  ఎంపీ పోతగంటి రాములు విద్యార్థులకు సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం జెపి నగర్ సాంఘిక సంక్షేమ గురుకులంలో ఆదివారం ఏర్పాటు చేసిన స్వచ్ఛ గురుకుల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి విద్యే మూలం అని తెలిపారు. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలని ఆయన కోరారు.

తెలంగాణ ప్రభుత్వం గురుకులాల్లో నాణ్యమైన వసతులు విద్య కల్పించడానికి ఒక్కో విద్యార్థికి లక్ష ఇరవై వేలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి పుట్టిన ఊరుకు కన్న తల్లిదండ్రులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకువచ్చి జీవితంలో స్థిరపడాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం గురుకులం ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి జెడ్పిటిసి సభ్యుడు పోతుగంటి భరత్ ప్రసాద్ ప్రిన్సిపల్ దానం ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అరాచక పాలనకు పరాకాష్ఠ

Satyam NEWS

రక్తదానంతో సమాజానికి ఉపయోగం మనకు ఆరోగ్యం

Satyam NEWS

కొత్తూరులో హైటెక్ వ్యభిచారం..?

Satyam NEWS

Leave a Comment