31.7 C
Hyderabad
April 25, 2024 01: 40 AM
Slider హైదరాబాద్

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

#uppalmla

విద్యార్థులు చదువుతోపాటు  క్రీడల్లో బాగా రాణించాలని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి,  కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అన్నారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ( బిసిసిఐ ) అండర్ 25 మేన్స్ వన్ డే సీనియర్ క్రికెట్ పోటీలకు ఎంపికైన మల్లాపూర్ డివిజన్ కు చెందిన  MD. సాకులేన్ అరాఫత్ ను గురువారం ఘనంగా సన్మానించారు.

మల్లాపూర్ డివిజన్ వెంకట్ రమణ కాలనీ కి  చెందిన గౌస్ – నజీమా   కుమారుడు ఇటీవల జరిగిన  క్రికెట్ ఎంపిక పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి అండర్ 25 మేన్స్ వన్ డే సీనియర్ క్రికెట్ పోటీలకు ఎంపికైన సందర్భంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని,  క్రికెట్ పోటీలకు ఎన్నికై నందుకు చాలా గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో  వెంకట్ రమణ కాలనీ అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు. మేడ్చల్ సత్య న్యూస్ ప్రతినిధి

Related posts

రైతు బిల్లును ఉపసంహరించుకోవాలని నేడు బైక్ ర్యాలీ

Satyam NEWS

ఏప్రిల్ 4 న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్స్‌ పరీక్ష

Murali Krishna

క్రైస్తవ సోదర సోదరీమణులకు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ కానుక

Satyam NEWS

Leave a Comment