విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం కోవిడ్ పేరుతో తెస్తున్న సంస్కరణలకు వ్యతిరేకంగా కేంద్ర శాఖ పిలుపు మేరకు కడప జిల్లా రాజంపేటలో ఏఐటీయూసీ కార్యాలయంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సర్వేపల్లి నరసింహ అధ్యక్షత వహించారు.
కరోనా మహమ్మారి మూలంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ నిరసన వ్యక్తం చేశారు. విద్యారంగంలో సంస్కరణలు పేరిట ఆన్ లైన్ పాఠాలు నిర్వహించాలని తలపెట్టారని దీని మూలంగా విద్యార్థులు నష్టపోతారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినాదాలు చేశారు.