శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు కోరాడ శారద, ఈదు సాయి జిల్లా స్థాయి కుస్తీ పోటీలలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు.
ఈ ఇద్దరు విద్యార్థులను ఈనెల 13న చిత్తూరు జిల్లా రేణిగుంటలో జరిగే రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు పంపుతున్నట్లు ప్రధానోపాధ్యాయుడు మక్క శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు డా.గుండ బాల మోహన్ తెలిపారు.
పాఠశాల ఉపాధ్యాయులు పి.సత్యవతి, యం . శాంతారావు, జి. భూషణ రావు, డి.ఎం.మల్లేశ్వరి, ఎస్ . ఎల్.శివ జ్యోతి, ఏ. మాధవి భాయ్, పీ. వీ. జీ . లక్ష్మి, జె. లలిత, కె . సురేష్, ఆర్ట్ ఉపాధ్యాయుడు సి. హెచ్ . రవి కుమార్, క్రాఫ్ట్ ఉపాధ్యాయుని బి. త్రివేణి, విద్యార్థులను అభినందించారు.