37.2 C
Hyderabad
April 19, 2024 14: 11 PM
Slider వరంగల్

పేదింటి పెళ్ళికి భోజన సదుపాయం అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

#taslima

ఓ పేదింటి వివాహ శుభకార్యానికి భోజన సదుపాయం ఏర్పాటు చేసి సహృదయాన్ని చాటుకున్నారు ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. ములుగు జిల్లా కేంద్రంలోని మతిస్థిమితం కోల్పోయిన మహమ్మద్ మహిబుబి అనే మహిళ తన కుమారుడు అంకూస్ పెళ్ళికి కనీసం భోజనం పెట్టలేని స్థితిలో ఉంది. ఈ విషయాన్ని తస్లీమాకు తెలిపారు. వారి పరిస్థితిని చూసిన తస్లీమా సర్వర్ ఛారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెళ్ళికి వచ్చిన బంధువులకు భోజనం ఏర్పాటు చేసి దాతృత్వం చాటుకున్నారు. తస్లీమా చేసిన సహాయానికి కాలనీ వాసులు,బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

కాంగ్రెస్ నేత ఆఫీసులో ఎన్నికల అధికారుల సోదాలు

Satyam NEWS

రానున్న ఎన్నికల కోసం ఇప్పటినుంచే కష్టపడాలి

Satyam NEWS

ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్ల సంఘానికి విజయ్ నాయక్ ఎన్నిక

Satyam NEWS

Leave a Comment