బాధిత కుటుంబాన్ని పరామర్శించి,చేయూతనందించిన సర్వర్ ఫౌండేషన్ వ్యస్థాపకులు,సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్,ములుగు జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన జన్ను రాజయ్య అనారోగ్యంతో ఇటీవలే మరణించారు.
సోమవారం మృతుడి భార్య రాజమ్మను ఓదార్చి, సర్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం సాయం అందించారు,అనంతరం తస్లీమా మాట్లాడుతూ రాజయ్య మృతి ఆ కుటుంబానికి తీరని లోటని,నిరుపేద కుటుంబాలకు సర్వర్ ఫౌండేషన్ సహకారం ఉంటుందని తెలిపారు.
తస్లీమా వెంట సర్వర్ ఫౌండేషన్ సభ్యులు, స్వేరో సభ్యులు గుండాల రఘు,కొట్టెపాక శ్రీనివాస్,కొండమల్ల శ్రావణ్,ఓరుగంటి నవీన్,కల్లెపు అబ్రహం, బలుగురీ అశోక్,మామిడి పెల్లి రమేష్,చంటి సామ్యూల్, తదితరులు ఉన్నారు.