తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డికి పూర్తి మద్దతుగా నిలిచారు బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి.
తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే అన్య మతస్థుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తున్నట్లు టీటీడీ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చెప్పారని చంద్రబాబు నాయుడి కనుసన్నల్లో నడిచే మీడియా మాత్రమే ప్రచారం చేసిందని సుబ్రహ్మణ్య స్వామి టిట్టర్ లో పేర్కొన్నారు.
తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడి మతం గురించి ఎవరూ అడగలేరని కేవలం టిటిటి అధికారులు ఎవరినైనా అన్య మతస్థులుగా గుర్తిస్తేనే వారిని డిక్లరేషన్ అడగగలుగుతారని సుబ్రహ్మణ్య స్వామి స్పష్టం చేశారు. టీటీడీ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి నిన్న ఇచ్చిన క్లారిఫికేషన్ ను సుబ్రహ్మణ్య స్వామి యథాతధంగా నేడు ట్విట్ చేయడం గమనార్హం.
టీటీడీ ఎకౌంట్లను కాగ్ తో ఆడిట్ చేయించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నందున చంద్రబాబునాయుడు భయపడి పోయి ఈ విధమైన ప్రచారాలు చేయిస్తున్నారని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు.