తెలంగాణ వానర సేన ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన బిజెపి కార్పొరేటర్ లకు ఘన సన్మాన సభను సైదాబాద్ డివిజన్ లోని ఎస్బిహెచ్ కాలనీ కమ్యూనిటీ హల్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కంతేంద్ర స్వామి, స్వామి రామశివ చైతన్య స్వామిలు హాజరై సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేతమధుకర్ రెడ్డి, సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిలను శాలువలు కప్పి జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నామం రాంరెడ్డి మాట్లాడుతూ కబ్జాకు గురవుతున్నదేవాలయాల స్థలాలపై వాటిని కాపాడేందుకు తెలంగాణ వానర సేన ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. వానర సేన పక్క రాష్ట్రంలో కుడా ఏర్పాటు చేసి దేవాలయల భూ బకాసురుల నుండి నిరంతరం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగ్య నగర్ వానర సేన అధ్యక్షుడు శ్రీనివాసరావు, తెలంగాణ వానర సేన సెక్రెటరీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.