ఉద్యోగం వదిలిపెట్టిపోవాలని పై అధికారులు చేస్తున్న వత్తిడిని తట్టుకోలేకపోయిన ఒక అంగన్ వాడి టీచర్ ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఈ దుర్ఘటన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్లపల్లి లో జరిగింది. అంగన్ వాడి టీచర్ శివ నాగేంద్రం తనకు ఎదురైన వేధింపులు భరించలేక నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట పురుగుల మందు తాగబోయారు.
ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు శివ నాగేంద్రం ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దాంతో గండం తప్పింది. గ్రామానికి చెందిన ఆవుల శ్రావణి, బొళ్ల అంజిరెడ్డి ఇద్దరు కలిసి తనను ఉద్యోగం మానుకోవాలని బెదిరిస్తున్నట్లు శివ నాగేంద్రం తెలిపారు.
తాను మానేస్తే వారికి సంబంధించిన వాళ్ళను పెట్టుకుంటామంటూ ఆరు నెలల నుండి మానసికంగా వేధిస్తున్నారని ఆమె అన్నారు. న్యాయం చేయాలని ఎమ్మెల్యే వద్ద బోరున విలపించారు శివ నాగేంద్రం. ఈ విషయాలన్నీ 2టౌన్ పోలీసులకు వ్రాతపూర్వకంగా అంగన్ వాడీ టీచర్ శివ నాగేంద్రం పిర్యాదు చేసింది.