విజయనగరం లో ఒక్క సారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం రెండు వరకు ప్రచండ భానుడు అల్లాడించడంతో…నగరం మొత్తం కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. అరగంటలో ఒక్క సారి వాతావరణం మారిపోయింది. ఆకాశం… మబ్బులు లతో కమ్మేయగా…బలమైన ఈదురు గాలులు వీయసాగాయి.భారీ శబ్ధాలతో… చెట్లు విరిగిపడేలా భీకరమైన గాలులు వీయడంతో నగర ప్రజలు బెంబేలెత్తిపోయారు.దాదాపు అరగంట సేపు ఆ బలమైన ఈదురు గాలులు వీచి…నగర ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది.