ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఒక యువతి అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ శివారులోని చందా నగర్ లో ఈ దారుణం జరిగింది. టైలరింగ్ చేస్తూ జీవనం గడిపే ఏడుకొండలు, శమంతకమణి దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.
కుమార్తె పూజ అంబికా (21) బి.టెక్ కంప్యూటర్స్ చేస్తుంది. చదువుకుంటూనే మోతీలాల్ ఓస్వాల్ అనే ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీ లో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తూ ఉంది. వీరు చందానగర్ రాజీవ్ స్వగృహ లో నివాసం ఉంటున్నారు. గురువారం నాడు ఉదయం అయిదున్నర గంటల ప్రాంతంలో అందరూ వాకింగ్ కి వెళ్లే సమయంలో రాజీవ్ స్వగృహ లోని తన అపార్ట్ మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.
వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య, ఆత్మహత్య అసలు ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.