మరీ ఇలా కూడా జరుగుతుందా అనేలా ఒక దారుణ సంఘటన ఇది. కొడుకు తప్పిపోయాడకుని తల్లిదండ్రులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
తీరా చూస్తూ తమ కొడుకు ఇంటి పైన గదిలో ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించాడు.
ఈ దురదృష్టకరమైన సంఘటన అనంతపురం నగరంలో జరిగింది. అనంతపురం లోని రెవెన్యూ కాలనీలో ఈ నెల 7వ తేదీన కుర్రాడు ఆత్మహత్య చేసుకోగా ఆలస్యంగా నేడు ఆ సంఘటన వెలుగులోకి వచ్చింది.
చెన్నై లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కిరణ్ కుమార్ రెడ్డి పబ్జి గేమ్ కు బానిసై పోయాడు. ఇటీవల ప్రభుత్వం పబ్జి గేమ్ రద్దు చేయడంతో కిరణ్ కుమార్ రెడ్డి మనస్తాపానికి గురయ్యాడు.
ఈ నెల 7న తమ ఇంటిపైన నిర్మాణంలో ఉన్న ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకుని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి తల్లిదండ్రులు కుమారుడు కనిపించడం లేదంటూ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంటి పైన నిర్మాణంలో వున్న ఓ గది నుంచి దుర్వాసన వస్తుండటంతో తలుపులు పగలగొట్టి కూలీలు చూడటంతో అసలు విషయం బయటకు వచ్చింది.
ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు తల్లిదండ్రులు నరసింహారెడ్డి, హిమాజారాణి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.