31.2 C
Hyderabad
April 19, 2024 05: 33 AM
Slider అనంతపురం

పబ్జి గేమ్ కు అలవాటు పడి పై గదిలో ఆత్మహత్య

#Suicide by Student

మరీ ఇలా కూడా జరుగుతుందా అనేలా ఒక దారుణ సంఘటన ఇది. కొడుకు తప్పిపోయాడకుని తల్లిదండ్రులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

తీరా చూస్తూ తమ కొడుకు ఇంటి పైన గదిలో ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించాడు.

ఈ దురదృష్టకరమైన సంఘటన అనంతపురం నగరంలో జరిగింది. అనంతపురం లోని రెవెన్యూ కాలనీలో ఈ నెల 7వ తేదీన కుర్రాడు ఆత్మహత్య చేసుకోగా ఆలస్యంగా నేడు ఆ సంఘటన వెలుగులోకి వచ్చింది.

చెన్నై లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కిరణ్ కుమార్ రెడ్డి పబ్జి గేమ్ కు బానిసై పోయాడు. ఇటీవల ప్రభుత్వం పబ్జి గేమ్ రద్దు చేయడంతో కిరణ్ కుమార్ రెడ్డి మనస్తాపానికి గురయ్యాడు.

ఈ నెల 7న తమ ఇంటిపైన నిర్మాణంలో ఉన్న ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకుని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి తల్లిదండ్రులు కుమారుడు కనిపించడం లేదంటూ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంటి పైన నిర్మాణంలో వున్న ఓ గది నుంచి దుర్వాసన వస్తుండటంతో తలుపులు పగలగొట్టి కూలీలు చూడటంతో అసలు విషయం బయటకు వచ్చింది.

ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు తల్లిదండ్రులు నరసింహారెడ్డి, హిమాజారాణి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

నెల్లిమర్ల పోలీసు స్టేషన్ లో లాకప్ డెత్?

Satyam NEWS

ఖమ్మం లో అభివృద్ధి ఘనం

Bhavani

Danger bells: రాజస్థాన్ లో పెరిగిపోతున్న స్వైన్ ఫ్లూ కేసులు

Satyam NEWS

Leave a Comment