చిత్తూరు జిల్లా తిరుపతి లో పబ్జి గేమ్ ఒత్తిడి లోనై ఎం.తేజేశ్ (17) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటలో తోటి ఫ్రెండ్స్ తో అడలేక ఒత్తిడికి, నిరుత్సాహానికి లోనై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
మంగళం లో నివాసముంటున్న తేజేష్ తండ్రి భాస్కర్ టి టి డి లో ఉద్యోగి. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసి అలిపిరి ఎస్.ఐ పరమేశ్వర నాయక్ దర్యాప్తు చేస్తున్నారు.