కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో శనివారం అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మాచారెడ్డి గ్రామానికి చెందిన ఈరం బాల్ నర్సు (38), ఎర్రోళ్ల ప్రేమలత (35) గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కొంత కాలంగా ఇరువురి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోంది. బాల్ నర్సుకు భార్య, ఇద్దరు కుమారులు వున్నారు. ప్రేమలతకు భర్త, కుమారుడు వున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం వ్యవహారం ఇంట్లో తెలియడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.